తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక సమావేశం బుధవారం ఉదయం ప్రారంభంమైంది. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై విశ్లేషించడం, పార్టీ సభ్యత్వ నమోదు, సభ్యత్వాల డిజిటైజేషన్ ప్రక్రియపై చర్చ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జీవిత భీమా, పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పురోగతి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా పలు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ