మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు శనివారం నాడు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2019లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలతో ఎంపీ మాలోత్ కవితపై బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ నిర్వహించిన కోర్టు తాజాగా మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానాను విధిస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం ఎంపీ రూ.10వేల జరిమానాను చెల్లించారు. అనంతరం ఆమెకు కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ