తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4298 కేసులు నమోదవడంతో మే 15, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,25,007 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 32 మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2928 కి పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 6026 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 4,69,007 కు చేరుకుంది. ప్రస్తుతం 53,072 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాడు 64,362 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,40,16,740 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 3,76,591 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ