ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూన్ 7, మంగళవారం) సాయంత్రం జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో జీహెఛ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులతో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. అలాగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్, మురళీధర్రావు వంటి కీలక నేతలు హాజరుకానున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగానే పార్టీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం కావాల్సి ఉంది. ఆ సమయంలో కుదరకపోవడంతోనే తాజాగా బీజేపీ కార్పొరేటర్లను ఢిల్లీకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం, త్వరలో హైదరాబాద్ లో జరగబోయే జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ, పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై వీరికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY