ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి తోలిసారిగా వెండితెరపై కన్పించిన ‘ప్రాణం ఖరీదు’ సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైన విషయం తెలిసిందే. దీంతో 2022 సెప్టెంబర్ 22 నాటికీ ప్రాణం ఖరీదు విడుదలై 44 సంవత్సరాలు పూర్తికావడంతో చిరంజీవికి మెగాభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. 44 సంవత్సరాలుగా తన అద్భుత నటనతో, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను చిరంజీవి అలరిస్తున్నారు. కాగా ప్రాణం ఖరీదు సినిమా విడుదలై 44 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా గురువారం ఎమోషనల్ ట్వీట్ చేశారు.
“మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టినరోజు, ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి, ప్రాణప్రదంగా, నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు, నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY