కరోనా కష్టకాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి నేతృత్వం వహించి సినీకార్మికులను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నఅవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పావల శ్యామలకు, అలాగే కరోనాతో మృతి చెందిన పలువురు వీరాభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు, కరోనా వచ్చి చికిత్సకు ఇబ్బంది పడుతున్న అభిమానులకు చిరంజీవి లక్షల్లో సాయం చేశారు. తన అభిమాని వారసులు పేరిట ఆర్ధిక సహాయాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవల్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
ఇంతకుముందు ఎన్నోసార్లు ఎంతోమంది జర్నలిస్టులకు సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా భరత్ భూషణ్ అనే ఫోటో జర్నలిస్ట్ అనారోగ్యంతో ఉన్నారని ఆదుకోవాలని కోరగా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ చెక్కును చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు భరత్ భూషణ్ కి అందజేశారు. సాయం అందుకున్న భరత్ భూషణ్ మాట్లాడుతూ, ఆపద్భాందవుడిలా ఈ కష్టకాలంలో ఎందరికో సాయం చేస్తున్న చిరంజీవి కష్టంలో మమ్మల్ని ఆదుకున్నందుకు రుణపడి ఉన్నామని, ఆయన పెద్దమనసుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ