ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. “కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తారక్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు బాగానే ఉన్నారు. తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని ఆనందంగా అనిపించింది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
ముందుగా మే 10 న తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. దయచేసి ఎలాంటి ఆందోళన వద్దు, నేను బాగానే ఉన్నాను. నా కుటుంబం మరియు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. వైద్యుల పర్యవేక్షణలో అన్ని కరోనా ప్రోటోకాల్లను అనుసరిస్తున్నాము. గత కొన్ని రోజులుగా నాతో సంప్రదించిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అని జూ.ఎన్టీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ