దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరి నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు సినీ, రాజకీయ ఆమె నివాసానికి తరలి వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ముందుగా ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన ఆమె ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి.. ఉమా మహేశ్వరి సోదరుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో, ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు మొదటి నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారని, ఆయన కుమార్తె అకాల మరణం తనతో పాటు వారందరికీ ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. ఇక ఈ వార్త తెలిసిన సీఎం కేసీఆర్ కూడా ఎంతో ఆవేదన చెందారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట టీఆర్ఎస్ సీనియర్ నేత, ఢిల్లీ తెలంగాణ ప్రతినిధి వేణుగోపాల చారి తదితరులు ఉన్నారు. కాగా నిన్న ఉమా మహేశ్వరి తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY