హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ ను ముందుగా తెలంగాణ ప్రజలకి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం గర్వకారణం. తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి ఆ ఫలితం ఇక్కడి ప్రజలకు ముందుగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీనీ డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని వాక్సిన్ డోస్ లు ఇవ్వాలని కోరుతున్నాం. కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాబట్టి ప్రజలందరికీ అతిత్వరలో వాక్సిన్ అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీనీ కోరుతున్నాం” అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ