దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 28, శనివారం నాడు కూడా 4998 కరోనా కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,61,742 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,998 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 6,512 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 5,16,166 కు చేరుకుంది. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 91.9 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 36,578 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు శనివారం నాటికీ ఢిల్లీ నగరంలో 61,73,209 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ