టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య, పాడె మోసిన మంత్రి హరీశ్‌ రావు

Dubbaka, Harish Rao, Harish Rao At Last Rites of Party Activist Swami, Harish Rao Condoles Death Of TRS Activist, Last Rites of Party Activist Swami, Minister Harish Rao, Minister Harish Rao Participated in Last Rites of Party Activist Swami, TRS Party Activist Swami, TRS Party Activist Swami Demise

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఓటమితో మనస్థాపానికి గురై దౌల్తాబాద్‌ మండలం కొనయిపల్లిలో గ్రామంలో స్వామి అనే పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న టిఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర మంత్రి హరీశ్ ‌రావు కొనయిపల్లి గ్రామానికి వెళ్లి స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం స్వామి అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా హరీశ్ రావుతో పాటుగా స్వామి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, కార్యకర్త స్వామి మృతి చెందడం బాధ కల్గించిందన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. కార్యకర్తలు అధైర్యపడకుండా ముందుకెళ్లాలని సూచించారు. ఓటమిపై సహనం కోల్పోయి మనస్థాపం చెందొద్దని, సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ‌గా ఉంటుందన్నారు. స్వామి కుటుంబ సభ్యులకు త‌క్ష‌ణ సాయంగా రూ.2 లక్షలను అందించామ‌ని, భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fourteen =