దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు ప్రజలకు పంపిణీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక సిద్ధం చేసేందుకు 18 మంది సభ్యులతో రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ స్టీరింగ్ కమిటీకి ఛైర్పర్సన్గా వ్యవరించనున్నారు. ఇక కన్వీనర్గా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా పలు శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఉండనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక రూపకల్పన కోసం ఈ స్టీరింగ్ కమిటీ నెలకొకసారి సమావేశమై చర్చించనుంది.
Our Govt has set up steering committee of 18 members to chalk out distribution of #CovidVaccine. Healthcare workers will be the first to be vaccinated against the novel coronavirus whenever a vaccine is ready for the public#letsfightcoronavirus#coronavaccine #COVID19 pic.twitter.com/rHgNDV8fQh
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) November 11, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ