హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ఙతలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు దన్యవాదాలు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదు, గెలిచిననాడు పొంగిపోలేదు. ఓడినా, గెలిచిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుంది” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ