తెలంగాణ లోని నిర్మల్ జిల్లా మున్సిపాలిటీలో ఇటీవల చేపట్టిన పీహెచ్సీ వర్కర్ల నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ మేరకు నియామకాలను నిలిపి వేస్తునట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ ఆఫీస్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ మున్సిపాలిటీలో చేపడుతున్న 44 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియను ప్రస్తుతానికి ఆపాలంటూ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చానని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ పోస్టుల నియామకాలలో అవకతవకలు జరిగియంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలిపారు.
అయితే దీనిపై లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఇచ్చే నివేదికను పరిశీలించిన అనంతరం దీనిపై తదుపరి చర్యను ప్రకటిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే మరో మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే నియామకాలు చేపడుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లాలో చేపట్టిన నియామకాల ప్రక్రియ ఇలా అర్ధాంతరంగా ఆగిపోయింది. కలెక్టర్ ఇచ్చే నివేదిక కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ