తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 569 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 15, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,84,631కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 2,098 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,72,145 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.41 శాతంగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,107 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,379 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 133, రంగారెడ్డిలో 49, మేడ్చల్ మల్కాజ్గిరిలో 37, నల్గొండలో 33, ఖమ్మంలో 25, సంగారెడ్డిలో 20, హనుమకొండలో 19, సూర్యాపేటలో 18, నిజామాబాదులో 18, కరీంనగర్ లో 18, జగిత్యాలలో18 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ