కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి తల్లిదండ్రులకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఒక సూచన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టి-సాట్ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేసే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ట్విట్టర్లో కోరారు.
“లాక్ డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి తల్లితండ్రులకు ఒక సూచన: రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చు, పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. టి-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, ఆన్ లైన్ లో http://tsat.tv వెబ్ సైట్ ద్వారా లేదా Youtube/tsatnetwork, మరియు టి-సాట్ మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని” మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
లాక్ డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి తల్లితండ్రులకు ఒక సూచన: రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చు, పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు 1/2 pic.twitter.com/LhZvuBzEWZ
— KTR (@KTRTRS) April 6, 2020
టి-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, వెబ్సైట్ https://t.co/RpZzNUiiE9, లేదా Youtube/tsatnetwork, T-SAT Mobile App లలో అందుబాటులో ఉంటాయి.
2/2 pic.twitter.com/v5RpSkabFr
— KTR (@KTRTRS) April 6, 2020