ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఇప్పటి వరకు 208 దేశాలకు విస్తరించగా, మొత్తం 12,73,990 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే అన్ని దేశాల్లో కలిపి ఈ వైరస్ వలన మృతి చెందిన వారి సంఖ్య 70 వేలకు చేరుకోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, ప్రాన్స్, సౌత్ కొరియా, జర్మనీ దేశాల్లో అధికంగా ఉంది. ఇటలీలో ఇప్పటి వరకు అత్యధికంగా 15,887 మంది ప్రాణాలు కోల్పోగా, స్పెయిన్ లో 12,418 మంది, అమెరికాలో 9500 మంది, ప్రాన్స్ లో 8,078 మంది, చైనాలో 3300 మంది మృతి చెందారు.
మరోవైపు భారత్ లో కూడా కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 6, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4067కి చేరగా, ఈ వైరస్ వలన ఇప్పటివరకు 109మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 292మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా 3666 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.
[subscribe]