తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ ముందుకొచ్చింది. ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ సాఫ్రాన్ గ్రూప్ 150 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకుంది. హైదరాబాద్లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటు చేయటానికి సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు సాఫ్రాన్ గ్రూప్ నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కంపెనీకి ఆహ్వానం పలికారు. ఈ క్రమంలో ‘ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా’ హైదరాబాద్ మారబోతోందని కేటీఆర్ ప్రకటించారు.
Jubilant to welcome @SAFRAN group’s decision to select Hyderabad for its Mega Aero Engine MRO in India
This will be SAFRAN’s largest MRO globally and will be the first Engine MRO established by a global OEM in India pic.twitter.com/gzYdfe4SB3
— KTR (@KTRTRS) July 6, 2022
ఇక హైదరాబాద్లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దదని, అలాగే ఒక ప్రపంచ స్థాయి సంస్థ భారత్లో ఏర్పాటు చేయనున్న మొదటి ఇంజిన్ ఎంఆర్ఓ అని మంత్రి తెలిపారు. ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి మొత్తం విలువ 150 మిలియన్ డాలర్లని (దాదాపు రూ. 1,200 కోట్లు) వెల్లడించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీ ద్వారా సుమారు 800 నుంచి 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ