సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 13, మంగళవారం నాడు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం ఐదుగురు పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సమావేశమై ఈ నియామకాలపై చర్చించింది. అనంతరం ఐదుగురు హైకోర్టు చీఫ్ జస్టిస్/జడ్జిలకు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించడానికై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తునట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జడ్జిల సంఖ్య 28 ఉండగా, తాజాగా కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు పేర్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తే ఆ సంఖ్య 33 కు చేరనుంది.
సుప్రీంకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన వారి వివరాలు:
- జస్టిస్ పంకజ్ మిథల్ – చీఫ్ జస్టిస్, రాజస్థాన్ హైకోర్టు
- జస్టిస్ సంజయ్ కరోల్ – చీఫ్ జస్టిస్, పాట్నా హైకోర్టు
- జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ – చీఫ్ జస్టిస్, మణిపూర్ హైకోర్టు
- జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా – జడ్జి, మణిపూర్ హైకోర్టు
- జస్టిస్ మనోజ్ మిశ్రా – జడ్జి, అలహాబాద్ హైకోర్టు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE