భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో ట్రినిడాడ్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్ కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ బుధవారం నాడు ప్రకటించింది. ఈ సిరీస్ కు నిర్ణీత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించారు. ఈ వన్డే సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను, వైస్ కెప్టెన్ గా రవీంధ్ర జడేజా వ్యవహరించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. కాగా శుభ్మన్ గిల్, సంజూ శాంసన్ చాలా కాలం తర్వాత మళ్ళీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.
వెస్టిండీస్ 3 వన్డేలకు భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY