తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టుగా ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా ప్రకటించింది. గ్లాండ్ఫార్మా ఎండీ, సీఈవో శ్రీనివాస్ సదుతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశమైన అనంతరం ఈ పెట్టుబడుల విషయాన్ని ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్లాండ్ ఫార్మా తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని మరియు బయోలాజికల్ వంటి అడ్వాన్స్ ఏరియాల కోసం మరో 500 ఉద్యోగాలను సృష్టిస్తోందని ప్రకటించడం ఆనందంగా ఉంది. తెలంగాణ లైఫ్ సైన్సెస్ మరియు జీనోమ్ వ్యాలీ యొక్క బలం రోజురోజుకు పెరుగుతోంది” అని పేర్కొన్నారు.
గ్లాండ్ ఫార్మా ఏర్పాటు చేసే ఫెసీలిటీ/సదుపాయం బయోలాజికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్ మరియు రీకాంబినెంట్ ఇన్సులిన్ వంటి అధునాతన రంగాలపై దృష్టి సారించడం సంతోషకరం. ఈ సదుపాయం నిజంగా హైదరాబాద్ మరియు జీనోమ్ వ్యాలీలో లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం యొక్క బలాన్ని ప్రదర్శిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్లాండ్ ఫార్మా సదుపాయం 500 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధిని కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్సైన్సెస్ సీఈవో శక్తి నాగప్పన్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE