ప్రముఖ ఇన్నర్ వేర్ బ్రాండ్ ‘జాకీ’ (పేజ్ ఇండస్ట్రీస్) కంపెనీ తెలంగాణలో తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం మరియు ములుగు నియోజకవర్గాల పరిధిలో నూతన గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం ప్రకటించారు. ఈరోజు ఉదయం జాకీ కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్కు వారు తెలిపారు. దీనిని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీల ద్వారా రాష్ట్రంలో సుమారు 7,000 మందికి ఉపాధి కలుగనుందని, అలాగే ఈ ఫ్యాక్టరీల నుంచి 1 కోటి వస్త్రాలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ‘జాకీ’ పెట్టుకుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో జాకీ కంపెనీని హృదయపూర్వకంగా తెలంగాణకు స్వాగతిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Delighted to share that popular inner wear brand Jockey (Page Industries) will be setting up garment manufacturing factories in Ibrahimpatnam & Mulugu, producing 1 Cr garments creating 7000 jobs in the state
Hearty Welcome & best wishes to the company as it embraces Telangana 👍 pic.twitter.com/HAHGtqy3jx
— KTR (@KTRTRS) November 16, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE