దావోస్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దూకుడు చూపిస్తున్నారు. మొదటి రోజే రూ. 600 కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఆయన బుధవారం కూడా అదే జోరు చూపిస్తున్నారు. ఈరోజు మరో అంతర్జాతీయ కంపెనీ ‘అలీఆక్సిస్’ తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు అలీఆక్సిస్ కంపెనీ రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Another major investment for Telangana from Davos!@AshirvadPipe of @WeAreAliaxis will be setting up a Greenfield Facility with an investment of Rs. 500 Crore in Telangana. This investment will create over 500 jobs for youngsters in our state.#TelanganaAtDavos#InvestTelangana pic.twitter.com/cXD1pDbGvL
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2022
కాగా అలీఆక్సిస్ అనేది ప్రముఖ ఆశీర్వాద్ పైప్స్కు చెందిన కంపెనీ. దావోస్లో మంత్రి కేటీఆర్తో చర్చలు ముగిసిన అనంతరం అలీఆక్సిస్ కంపెనీ ప్రతినిధులు ఈ మేరకు ప్రకటన చేశారు. దీనివలన దాదాపు 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ప్లాస్టిక్ పైపులు, యాక్సెసరీస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ