కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
“త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తీవ్రంగా పోరాడాడు. ప్రజల ఆశీస్సులతో మరో టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు అసెంబ్లీలోకి ప్రవేశిస్తారని ఆశిస్తున్నాం” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నికలో తనపై నమ్మకం ఉంచి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ