తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఇన్సూరెన్స్ కంపెనీ ‘స్విస్ రే’ హైదరాబాద్లో కంపెనీని స్థాపించడానికి తన సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్నటి నుంచి మొదలైన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్న కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వివిధ కంపెనీలకు వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్విస్ రే కంపెనీ ఎండీతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
Happy to announce a big addition to Hyderabad BFSI ecosystem
A big welcome to @SwissRe who will be setting up their office in Hyderabad this August
Swiss Re is a 160 year old insurance organisation, headquartered in Zurich, Switzerland and operates in 80 locations globally pic.twitter.com/1bpRA6vNX1
— KTR (@KTRTRS) May 23, 2022
ఈ సందర్భంగా బీమా రంగంలో స్విస్ రే కంపెనీకి 160 ఏళ్ల ఘన చరిత్ర ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లోని జ్యురిచ్ కేంద్రంగా పని చేస్తున్న స్విస్ రే కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 80 ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తోందని, త్వరలోనే మన హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుందని తెలిపారు. అలాగే దావోస్ వరల్డ్ ఎననామిక్స్ ఫోరం సదస్సు వేదికగా తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సెన్సెస్ అభివృద్ధిపై చర్చ జరిగింది. దీనిలో కేటీఆర్తో పాటు డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి జీవీ ప్రసాద్ రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహ్మద్ అథర్ పాల్గొన్నారు. సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. లైఫ్ సెన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్ నిలిచిందని పేర్కొన్నారు. కరోనా వల్ల లైఫ్ సైన్సెస్, మెడికల్కు ప్రాధాన్యం పెరిగిందని, భవిష్యత్ అవసరాల కోసం మరిన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ