తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈవో పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏఈవో పోస్టుల నియామకాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. సమగ్ర వ్యవసాయ విధానం అమలుకోసం ఏఈవో క్లస్టర్లలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగుల నియామకానికి ఆదేశాలిచ్చారు. ఉద్యోగుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించడం జరిగిందని చెప్పారు.
అభ్యర్థుల ఎంపికలో మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషనే ప్రాతిపదికగా పరిగణిస్తారని, నిరుద్యోగ అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని చెప్పారు. ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు. ఈ పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]