తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముస్తాబాద్లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రాచర్ల బొప్పాపూర్లో మార్కెట్ కమిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. రైతు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాచర్ల గొల్లపల్లిలో వ్యవసాయ గోదాంకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.
రాచర్ల బొప్పాపూర్లో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం ఎట్లా ఉందో రైతులందరికీ తెలుసని, రైతులకు నీళ్లకు, కరెంట్కు,పెట్టుబడికి, విత్తనాలకు, ఎరువులకు ఎలాంటి కొదవ లేదని అన్నారు. ఇలాంటి కరోనా సంక్షోభంలోనూ రైతులకు ఇటీవలే రూ.1,200 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో గ్రామాల్లో చెరువులన్నీ నిండుతున్నాయని, రైతులు సేద్యం చేసుకునేందుకు అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా నీరు అందిస్తామని, దసరా వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టే నియంత్రిత పంటల సాగు విధానంతో దేశంలో వ్యవసాయానికి కొత్తశకం ప్రారంభం కానుందని తెలిపారు. మద్దతు ధర వచ్చే పంటలే సాగు చేయించి, రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులుశ్రీ @KTRTRS, శ్రీ @SingireddyTRS, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ @vinodboianpalli. pic.twitter.com/zEOHRZOhlJ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2020
Minister @KTRTRS inaugurated the Administrative Office Building in Racharla, Sircilla. Minister @SingireddyTRS and Telangana State Planning Board Vice-Chairman B Vinod Kumar were present. pic.twitter.com/euX0t4hKd5
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu