దేశవ్యాప్తంగా మే 31 వ తేదీ వరకు విధించిన నాలుగో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అన్ని రంగాలకు సడలింపులు ఇవ్వగా తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏపీలో ప్రకటించిన తాజా మార్గదర్శకాలు:
- వస్త్ర, బంగారం దుకాణాలు తో పాటుగా చెప్పుల దుకాణాలు తెరవడానికి ఏపీ పురపాలక శాఖ అనుమతి. అయితే నిబంధనలకు అనుగుణంగానే దుకాణాలు తెరవాల్సి ఉంటుంది.
- బట్టల దుకాణాల్లో ట్రయల్ రూమ్స్ కి అనుమతి లేదు.
- బంగారు ఆభరణాల దుకాణాల్లో వినియోగదారులకు డిస్పోజబుల్ గ్లోవ్స్ అందుబాటులో ఉంచాలి.
- రాష్ట్రంలో పెద్ద దుకాణాల్లో షాపింగ్ కోసం ముందుగానే ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవాలి.
- స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ నడిపేవారు మాస్కులు, గ్లోవ్స్ ధరించాలి. పార్సిళ్లకు సైతం అనుమతి.
- పానీపూరి బండ్లకు అనుమతి లేదు.
- దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా దుకాణాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
- అలాగే దుకాణాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
- లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu