దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ ‘రేడియంట్ ఎలక్ట్రానిక్స్’ యొక్క నూతన ప్లాంట్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల గ్రామం పరిధిలోని ఈ-సిటీలో ఈ కొత్త ప్లాంట్ను మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే పదేళ్ల కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించటానికి ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రెండు లక్షల కోట్ల పైబడి ఆదాయంతో పాటు దాదాపు 16 లక్షల ఉద్యోగాల కల్పన చేపట్టనున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని, ఇప్పటికే ఫ్యాబ్ సిటీలో 15 వేల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఈ రేడియంట్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజాలైన శ్యాంసంగ్, పానాసోనిక్, అమెజాన్ స్కైవర్త్, మోటోరోలా, వన్ ప్లస్, నోకియా కంపెనీలకు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీలో 3,800ల మంది ఉద్యోగులు ఉన్నారని, నెలకు 4 లక్షల చొప్పున ఒక యేడాదికి 50 లక్షల ఎల్ఈడీ టీవీలు తయారుచేస్తున్నదని ఈ సందర్భంగా రేడియంట్ కంపెనీని ప్రశంసించారు మంత్రి కేటీఆర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ