ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 5, గురువారం నాడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చిన్నపిల్లలకు వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో అలిపిరి వద్ద రూ.240 కోట్లతో వ్యయంతో, అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం టాటా క్యాన్సర్ ఆసుపత్రిని, తిరుపతి లోని బర్ద్ ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డును సీఎం ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇటీవలే పునర్నించిన శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమాల తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో “జగనన్న విద్యాదీవెన” కార్యక్రమానికి సంబంధించి నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. తిరుపతిలో సీఎం పర్యటన సందర్భంగా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కే.వెంకట రమణారెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ