హైదరాబాద్లో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ (IEC)ను ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా.. బోస్టన్లో థర్మో ఫిషర్స్ ప్రతినిధులను కలిశానని, ఈ మేరకు వారు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్కు సంబంధించిన మొత్తం పర్యావరణ వ్యవస్థకు, హైదరాబాద్ను ఆకర్షిస్తున్న ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలకు థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఐఈసీ ప్రారంభోత్సవం నిదర్శనమన్నారు. లైఫ్ సైన్సెస్లో డేటా సైన్స్ కలుస్తుందని, తెలంగాణలో 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధన లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. సుమారు 15 మిలియన్లు డాలర్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న థర్మో ఫిషర్స్ సంస్థ 450 మందికి పైగా ఇంజినీర్లకు ఉపాధిని కల్పించనుంది” అని తెలిపారు.
IT and Industries Minister @KTRTRS inaugurated the @thermofisher Scientific’s India Engineering Center (IEC) in Hyderabad today. pic.twitter.com/3sMvDHwua8
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 28, 2022
IEC అనేది ప్రపంచ స్థాయి పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంగా పేరు గాంచింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్, రీజెంట్లు, వినియోగ వస్తువులు మరియు సాఫ్ట్వేర్ సేవలలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. హైదరాబాద్లోని కేంద్రం 42,000 చ.అడుగుల విస్తీర్ణంలో ఇంజనీరింగ్ ల్యాబ్ను కలిగి ఉంది. కొత్తగా విస్తరించిన ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ భారతదేశంలోని థర్మో ఫిషర్ యొక్క R&D సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా కొత్తగా 450 ఉద్యోగాలను సృష్టించింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ R&Dలో పరిశోధనల కోసం సంవత్సరానికి $1.4 బిలియన్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ