ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను, 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో 25 మంత్రులతో నూతన కేబినెట్ ఏర్పాటు జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, పార్టీ మరియు ప్రభుత్వం మధ్య సమన్వయం, ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజలకు వివరించడం, ఇంటింటికి వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహణ సహా పలు అంశాలపై సీఎం వైఎస్ జగన్ వారికీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, కొత్తగా బాధ్యతలు తీసుకున్నవారికి సూచనలు నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహించినట్టుగా సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ