తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మంత్రి కేటీఆర్ నిర్వహించనున్నారు. వరుసగా జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణం, గద్వాల మండలంలోని గోన్పాడ్ వద్ద షాదీఖాన నిర్మాణంకు భూమిపూజ, సంగాల పార్కు ప్రారంభోత్సవం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గ్రంథాలయ భవనం, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు, ఆడిటోరియం నిర్మాణానికి, జూనియర్ కళాశాల కోసం భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. అలాగే మార్కెట్ యార్డు ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కూడా మంత్రి కేటీఆర్ భూమిపూజ చేస్తారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. సభ అనంతరం హెలిక్యాప్టర్ లో తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ