రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తునట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మే 1 నుండి మే 19 వరకు జరగాల్సిన 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేస్తున్నామని, తర్వాత ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితికి అనుగుణంగా జూన్ మొదటివారంలో సమీక్ష నిర్వహించి, ఆ తరువాత పరీక్షల నిర్వహణ తేదీల వివరాలు ప్రకటిస్తామన్నారు. అయితే పరీక్షలు ప్రారంభానికి కనీసం 15 రోజుల ముందే నోటీసు ఇవ్వబడుతుందని తెలిపారు. అలాగే బ్యాక్ లాగ్స్ ఉన్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు కనీస పాస్ మార్క్స్ ఇవ్వబడతాయని చెప్పారు.
మరోవైపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రస్తుతానికి పరీక్షలు లేకుండానే పైతరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్షలు నిర్వహించబడతాయని చెప్పారు. ఇక ఎంసెట్ పరీక్షకు సంబంధించి 25 శాతం ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ విధానం ఈ సంవత్సరం పరిగణించబడదని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ