తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మించిన స్వాగత తోరణాన్ని మరియు కూడలిలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టనున్న పునరుద్ధరణ పనులుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం, పదిరకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు నిర్మించుకోనున్న రా రైస్ మిల్లు నిర్మాణానికి మరియు పెట్రోల్ బంక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితుల సాధికారత, స్వావలంబన కోసమే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వారంతా మంచి వ్యాపార వేత్తలుగా ఎదగాలని అన్నారు. దళితులకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేసే పథకం దేశంలోనే ఎక్కడా లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ