బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు (మే 5, గురువారం) తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ రెండో విడత యాత్ర ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతుంది, రేపటికి 22వ రోజుకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర సందర్భంగా మహబూబ్నగర్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు.
మహబూబ్నగర్ లోని ఎంవీఎస్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో గురువారం సాయంత్రం 4 గంటలకు ‘జనం గోస-బీజేపీ భరోసా’ పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించనున్నారు. రేపు మధ్యాహ్నం జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడనుంచి రోడ్డు మార్గాన మహబూబ్నగర్ చేరుకొని, ముందుగా బీజేపీ నాయకులతో సమావేశమై, అనంతరం సభలో పాల్గొంటారు. ఈ సభ కోసం జనసమీకరణ సహా ఇతర అంశాలపై రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు దృష్టి సారించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ