తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. తన నాయనమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థం ఆమె స్వగ్రామమైన కోనాపూర్ లో తన వ్యక్తిగత నిధులతో ఈ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
ముందుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నా నాయనమ్మ శ్రీమతి వెంకటమ్మ గారి జ్ఞాపకార్థం నా వ్యక్తిగత నిధులతో “మన ఊరు-మన బడి” కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తున్నాను. ఆమెను స్మరించుకోవడానికి ఇంతకంటే మెరుగైన మార్గం గురించి ఆలోచించలేను. కామారెడ్డిలోని ఆమె స్వగ్రామమైన కోనాపూర్లో ఈరోజు పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.
Couldn’t think of a better way of commemorating the memory my Late grandmother Smt. Venkatamma Garu than building a Govt school under the “My village – My School” in my personal capacity 😊
Delighted to be laying the foundation today at her ancestral village Konapur in Kamareddy pic.twitter.com/LwdFKxajZD
— KTR (@KTRTRS) May 10, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ