తెలంగాణ రాష్ట్ర ఐటీ, మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో మంత్రి కేటీఆర్ చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (పీఆర్టీఎస్), మురుగునీటి శుద్ధి ప్రణాళికలపై చర్చించారు. పెరుగుతున్న జనాభా, ఉద్యోగ అవకాశాల దృష్ట్యా హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న మెట్రో, ఎంఎంటీఎస్ తో పాటుగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది.
ముందుగా అసెంబ్లీ నుండి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు 10కిమీ పాటు పీఆర్టీఎస్ కారిడార్ ను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఈ నేపథ్యంలో అందుకు కావాల్సిన ప్రమాణాలు మరియు స్పెసిఫికేషన్లను వేగవంతం చేయడంలో సహకరించాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. అలాగే నగరంలో మురుగునీటి శుద్ధి ప్రణాళికలో భాగంగా ఎస్టీపీల నిర్మాణాలకు రూ.8,654.54 కోట్లు ఖర్చు అవుతుందని, అందులో మూడో వంతు అయిన రూ.2,850 కోట్లను కేంద్ర అమృత్-2 పథకం కింద ఇవ్వాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF