తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం యూకేలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా యూకేలో వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వివిధ పెట్టుబడి అవకాశాలను చర్చించి, హైదరాబాద్ కు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఆయనను కోరారు.
మరోవైపు లండన్లోని భారత హైకమిషన్ నెహ్రూ సెంటర్లో నిర్వహించిన ‘తెలంగాణ రోడ్ షో’ లో ప్రవాస భారతీయులు మరియు భారత్ అండ్ యూకే ఆధారిత పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలోని ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, పెట్టుబడిదారులకు ఉన్న అవకాశాలను కూడా వివరించారు. అలాగే లండన్లో జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను తన ప్రసంగంలో మంత్రి కేటీఆర్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF