తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో గొప్ప మలుపుగా నిలిచిపోయింది. దీంతో ప్రతి సంవత్సరం నవంబర్ 29వ తేదీని టీఆర్ఎస్ పార్టీ ‘దీక్షా దివస్’గా నిర్వహిస్తుంది. సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దీక్షా దివస్ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
“మీ పోరాటం అనితర సాధ్యం. ఒక నవశకానికి నాంది పలికిన రోజు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు. చరిత్రను మలుపు తిప్పిన రోజు 2009, నవంబర్ 29. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. దీక్షా దివస్” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మీ పోరాటం అనితర సాధ్యం 🙏
ఒక నవశకానికి నాంది పలికిన రోజు
ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు
తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు
చరిత్రను మలుపు తిప్పిన రోజు 29th Nov, 2009. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు
దీక్షా దివస్ #DeekshaDivas pic.twitter.com/ehzGByfGAp
— KTR (@KTRTRS) November 29, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE