తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. స్వీయ నియంత్రణ, ప్రజలంతా పరస్పరం ఒకరికొకరు దూరంగా ఉండడం (సామాజిక దూరం) వంటి విషయాలను పాటిస్తే కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెప్పారు. కీలక నిర్ణయాలతో హాంకాంగ్, సింగపూర్, జపాన్ దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయని అన్నారు. మరోవైపు ఉదాసీనతతో వ్యవహరించిన ఇటలీ, అమెరికా దేశాలు ప్రస్తుతం ఈ వైరస్ వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలుతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ, ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తే కరోనా వైరస్ ను అడ్డుకోగలుగుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Hong Kong, Singapore & Japan have been able to contain #CoronaVirus whereas Italy, US & others are regretting that they didn’t act when they had to
The key lies in #SocialDistancing #SelfIsolation and #SelfRegulation
Please follow Govt guidelines; #StaySafe 🙏 pic.twitter.com/zDkhTwGWRu
— KTR (@KTRTRS) March 21, 2020
Guidelines for Home Quarantine. Please retweet and spread the word#HomeQuarantine#SelfIsolation pic.twitter.com/YyDmMMWzud
— KTR (@KTRTRS) March 20, 2020
[subscribe]