బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత కొన్ని నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య అంతరం బాగా పెరిగింది. సీఎం కేసీఆర్ కూడా కేంద్రప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమ్మర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా సందర్భం దొరికినప్పుడల్లా బీజేపీపై పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పార్లమెంట్లో ఎంపీలు ఉపయోగించకూడదంటూ కొన్ని పదాలను నిషేధిత జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ సర్కార్ పార్లమెంట్ లాంగ్వేజ్ అంటూ కేటీఆర్ కొన్ని పదాలను ఉదహరిస్తూ ట్వీట్ చేశారు.
Parliamentary language of NPA Govt
✅ PM calling protesters “Andolan Jeevi” is fine
✅” Goli Maaron Saalon Ko” by Minister is okay
✅ “80-20” by UP Chief Minister is okay
✅ Denigration of Mahatma Gandhi by BJP MP is fine
✅ Farmer protesters insulted as “Terrorists” is fine pic.twitter.com/0Q4nfUmuET— KTR (@KTRTRS) July 16, 2022
ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్.. ‘ఆందోళనకారులను ఆందోళన్ జీవి అని ప్రధాని పిలవడం, గోలి మారో సాలోం కో అని ఒక బీజేపీ మంత్రి వ్యాఖ్యానించడం, 80-20 అని యూపీ సీఎం వ్యాఖ్యానించడం, ఆందోళన చేస్తున్న రైతులను అవమానపరుస్తూ బీజేపీ నాయకులు వారిని టెర్రరిస్టులు అని సంబోధించడం’ వంటి వ్యాఖ్యలను ఎత్తిచూపారు. ఇదే బీజేపీ నాయకుల పార్లమెంట్ భాష అని కేటీఆర్ విమర్శిస్తూ ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు.
లోక్సభ, రాజ్యసభ.. ఉభయ సభల్లో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్ సభ సెక్రటేరియట్ ఒక బుక్లెట్ను ఇటీవలే విడుదల చేశారు. దీనిప్రకారం ‘జుమ్లాజీవి’, ‘కొవిడ్ స్పైడర్’, ‘స్నూప్గేట్’, వంటి ఇంగ్లీష్ పదాలను పార్లమెంట్లో వాడకూడదు. అలాగే ‘అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్’ వంటి పదాలతో పాటు మరికొన్ని హిందీ పదాలను అన్పార్లమెంటరీ పదాలుగా వర్ణించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ