తెలంగాణ రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శనివారం ఆయనకు తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో మంత్రి కమలాకర్ హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. కాగా మంత్రి కరోనా బారిన పడటం ఇది రెండోసారి. దీనికి ముందు గతేడాది అక్టోబర్లో కూడా ఆయన ఒకసారి కరోనా బారిన పడ్డారు.
#Covid pic.twitter.com/OXodeqQoz1
— Gangula Kamalakar (@GKamalakarTRS) July 16, 2022
అయితే దీనిపై మంత్రి గంగుల కమలాకర్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. తనకు కొంచెం తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, అయినా తాను ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే తన అనుచరులు మరియు ఇటీవలి కాలంలో తనను కలిసిన ఇతర వ్యక్తులను తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ