తెలంగాణ రాష్ట్రంలో వారంలోపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 4 లక్షలకుపైగా రెమిడెసివిర్ వయల్స్ అందుబాటులోకి ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు బుధవారం నాడు రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ కు సంబంధించి పలువురు తయారీదారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వారంలోగా 4 లక్షలకుపైగా రెమిడెసివిర్ వయల్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. కరోనా చికిత్సలో భాగంగా ఎమెర్జెన్సీ కేసులలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం కూడా పెరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రెమిడెసివిర్ కొరత లేకుండా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ