ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 39,619 కరోనా పరీక్షలు నిర్వహించగా 9716 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1444, గుంటూరులో 1236, చిత్తూరులో 1180, కర్నూల్ లో 958, నెల్లూరులో 935 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,86,703 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కృష్ణాలో పదిమంది, నెల్లూరులో ఏడుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు మరియు అనంతపూర్ జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7510 కి పెరిగింది. గత 24 గంటల్లో 3359 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 9,18,985 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ