తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని కొడంగల్ మరియు కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, మినిస్టర్ హరీష్ రావులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Glad Kodangal and Kosgi both now have improved medical care facilities that have been neglected in 6 decades of Congress rule 👍
Thanks to CM KCR Garu & Health Minister @trsharish Garu https://t.co/HZDqA1Wjfc
— KTR (@KTRTRS) June 16, 2022
కాగా మంత్రి హరీష్ రావు ఈ ఆస్పత్రుల్లోని అభివృద్ధిని తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టులు పెట్టారు. దీనిలో కొడంగల్ సివిల్ ఆస్పత్రిలో పడకల సంఖ్య 50 బెడ్లకు పెంచామని, సీఎం కేసీఆర్ సూచనల మేరకు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఎక్స్-రే, అల్ట్రా సౌండ్ వంటి సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. అలాగే మరో రూ. 5 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన సీహెచ్సీని రేపు ప్రారంభించనున్నట్లు ఆ ట్వీట్లో మంత్రి హరీష్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ