తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్రంలోని బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రస్తుతం దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా గ్యాస్ సిలిండర్ (LPG ) రేటు అత్యధికంగా మన దేశంలోనే ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలో గత 30 యేళ్ల గరిష్ఠానికి చేరుకుందని వెల్లడించారు. ఇక మరో ముఖ్యమైన సమస్య నిరుద్యోగం అని, గడచిన 45 సంవత్సరాలలో ఇంత పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తయారవడానికి కారణం బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు.
Amazed at the audacity of NPA Govt & its chieftains who’ve destroyed economy, led us to highest unemployment in 45 years, highest inflation in 30 years & highest LPG rate in the world!
Have been a colossal failure for India/Telangana; yet come & lecture us on administration 🤦
— KTR (@KTRTRS) May 6, 2022
ఇక తెలంగాణ పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్వాగతం చెప్పారు మంత్రి కేటీఆర్. అయితే దీనికి ముందు కేటీఆర్ నిన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ.. తమ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల సంక్షేమం కోసం అమలు చేసేందుకు, తెలంగాణలో ఉన్న ఉత్తమ విధానాల గురించి తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి సూచించారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్, రాజస్థాన్.. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణమాఫీ హామీ వంటి పథకాలు అందిస్తున్నాయా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ