ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు గురువారం నాడు మరో రూ.500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందే నాలుగువిడతలుగా ప్రభుత్వం రూ.1,500 కోట్ల నిధులను విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా రూ.2000 కోట్ల నిధుల విడుదల నేటితో పూర్తయింది. మరోవైపు పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సీఎం ఆదేశాలతో పూర్తి నిధులు కూడా విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలిందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ