హుజూరాబాద్‌ లో దళిత బంధు అమలు: మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

Dalit Bandhu Funds, Dalit Bandhu Funds Release for Huzurabad, Dalit Bandhu in Huzurabad, Dalit Bandhu in Huzurabad Constituency, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme In Telangana, Dalit Bandhu Scheme News, Dalit enumaration in Huzurabad, Huzurabad, Mango News, telangana, Telangana Govt Completes Target of Rs 2000 Cr Dalit Bandhu Funds Release, Telangana Govt Completes Target of Rs 2000 Cr Dalit Bandhu Funds Release for Huzurabad

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు గురువారం నాడు మరో రూ.500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందే నాలుగువిడతలుగా ప్రభుత్వం రూ.1,500 కోట్ల నిధులను విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదలయ్యాయి.

దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా రూ.2000 కోట్ల నిధుల విడుదల నేటితో పూర్తయింది. మరోవైపు పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సీఎం ఆదేశాలతో పూర్తి నిధులు కూడా విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలిందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 4 =