ముఖ్యమైన పెట్టుబడిపై రేపు ప్రకటన చేయనున్న మంత్రి కేటిఆర్

IT Minister Rama Rao, KTR, KTR Latest News, KTR Politcal News, Minister KTR, Minister KTR to Make Important Investment, Minister KTR to Make Important Investment Announcement, Telangana News, Telangana Political Updates

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ అనుకూల విధానాలతో ఎన్నో సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతూ, గొప్ప అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో మరో ముఖ్యమైన పెట్టుబడిపై రేపు ప్రకటన చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ప్రకటించారు. ‌”రేపు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమైన పెట్టుబడి ప్రకటన చేయనున్నాను, వేచి చూడండి” అని మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కేటిఆర్ ప్రకటనతో ఏ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టబోతుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =