తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ అనుకూల విధానాలతో ఎన్నో సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతూ, గొప్ప అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో మరో ముఖ్యమైన పెట్టుబడిపై రేపు ప్రకటన చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ప్రకటించారు. ”రేపు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమైన పెట్టుబడి ప్రకటన చేయనున్నాను, వేచి చూడండి” అని మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కేటిఆర్ ప్రకటనతో ఏ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టబోతుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Will be making an important investment announcement at 11:30 am tomorrow. Watch this space
— KTR (@KTRTRS) November 5, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF