మెడికో ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

Minister KTR Visited the Family of KMC Medical Student Preethi Assures that Govt will support Them in All Ways,Minister KTR Visited Family of Preethi,KMC Medical Student Preethi,Govt will support Them in All Ways,Mango News,Mango News Telugu,Minister KTR visited Preeti's family,Minister KTR Latest News,Medical Student Preethi News,Minister KTR Live News,Minister KTR News Today,Minister KTR News,Telangana News,Medical Student Preethi Latest Updates

సీనియర్‌ వేధింపుల కారణంగా వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ధరావత్‌ ప్రీతి ఆత్మహత్యకు యత్నించి, పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని గిర్నితండా గ్రామం. కాగా ప్రీతి మరణంతో దుఃఖంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను బుధవారం తొర్రూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ కూడా ఉన్నారు.

ప్రీతి కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఓదార్చి, ధైర్యం చెప్పారు. ప్రీతి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అక్కడి నుంచే వరంగల్‌ సీపీ రంగనాథ్‌ తో మంత్రి కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడి ప్రీతి కేసు పురోగతి, దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే దోషులు ఎంత‌టి వారైనా వ‌దిలేది లేదని, ఇలాంటి ఘ‌ట‌న మ‌ళ్ళీ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తామని, ప్రీతి కుటుంబాన్ని ప్ర‌భుత్వప‌రంగా అన్ని విధాలుగా ఆదుకుని అండ‌గా ఉంటామ‌ని ఈ సందర్భంగా మంత్రులు హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 6 =